రాజ్యాంగం వచ్చిన రోజు
రాజరికం పోయిన రోజు
దేశ ప్రజలందరి పండుగ రోజు
అదే..అదే.. మన గణతంత్రపు రోజు
ఆంతరంగిక.. బాహ్య విషయాలలో
ఏ విదేశీ శక్తికి లోబడని
స్వతంత్ర దేశంగా నిలిచింది
సర్వసత్తాక రాజ్య మైంది
ఆర్ధిక అంతరాలను తగ్గిస్తూ
దేశ పురోభివృద్దిని కోరుతూ
వెనుకబడిన వారికి అండగా నిలిచి
సామ్యవాద రాజ్య మైంది..
వివిధ మతాల నిలయం
మత ప్రమేయం లేని విధానం
తటస్త మత వైఖరి కలిగి
లౌకిక రాజ్య మైంది..
ప్రజల కొరకు వెలిసింది
ప్రజల చేత ఏర్పడింది
ప్రజలే పాలకులై పాలించే
ప్రజాస్వామ్య రాజ్య మైంది..
రాజరికపు వారసత్వాలకు
ముగింపు పలికింది
ఎన్నికలే పాలకులకు కొలబద్ధయి
గణతంత్ర రాజ్య మైంది..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి